TRS: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం

  • టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం సమావేశం
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు
  • సమావేశంలోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి నిరాకరణ

కొద్ది సేపట్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ, శాసనసభాపక్షం విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృత స్థాయి సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం. వచ్చే నెల 2న జరగనున్న ప్రగతి నివేదన సభ నిర్వహణ, ఈ సభ విజయవంతానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడంతో పాటు, వివిధ ప్రభుత్వ పథకాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలోకి ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల అనుమతికి నిరాకరించినట్టు తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News