kothapalli geetha: ఏపీలో మరో రాజకీయ పార్టీ.. రేపు సొంత పార్టీని ప్రకటించనున్న కొత్తపల్లి గీత

- రేపు ఉదయం 11.30 గంటలకు పార్టీ ప్రకటన
- విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో పార్టీ వివరాలను వెల్లడించనున్న గీత
- 2014లో వైసీపీ తరపున గెలిచిన అరకు ఎంపీ
కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్టు అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రకటించారు. ఈ నెల 24వ తేదీన (రేపు) ఉదయం 11.30 గంటలకు పార్టీని లాంచ్ చేస్తున్నామని ఆమె తెలిపారు. విజయవాడలోని బెంజ్ సర్కిల్ లో ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో పార్టీకి సంబంధించిన వివరాలను వెల్లడించనున్నట్టు చెప్పారు.
