punam malakondaiah: ఏపీ వైద్య ఆరోగ్యశాఖకు ప్రపంచ బ్యాంక్ నిధులు

  • ప్రపంచ బ్యాంకు బృందం కలిసింది
  • నిధుల మంజూరుకు సంబంధించి చర్చించాం
  • నిధులిచ్చేందుకు అంగీకరించింది
  • పూనం మాలకొండయ్య వెల్లడి

ఏపీలోని వైద్య ఆరోగ్య శాఖలో వివిధ వ్యవస్థల బలోపేతానికి నిధులు ఇవ్వడానికి ప్రపంచ బ్యాంక్ బృందం అంగీకరించింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వెల్లడించారు. ప్రపంచ బ్యాంకు బృందం ఈరోజు పూనం మాలకొండయ్యను కలిసింది.

ఈ సందర్భంగా ఏపీ సచివాలయంలోని సమావేశ మందిరంలో వారు సమావేశమయ్యారు. నిధుల మంజూరుకు సంబంధించి పలు అంశాలపై చర్చించామని, వైద్య ఆరోగ్య శాఖకు నిధులు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంక్ బృందం అంగీకారం తెలిపిందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

  • Loading...

More Telugu News