vajpayee: వాజ్ పేయి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

  • వాజ్ పేయి మృతి తీరని లోటు
  • విలువలతో కూడిన రాజకీయాలను నడిపిన గొప్ప వ్యక్తి
  • వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలి

మాజీ ప్రధాని వాజ్ పేయి మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. వాజ్ పేయి మృతి తీరని లోటని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన వాజ్ పేయి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. ఉత్తమ పార్లమెంటేరియన్ గా, ప్రధానిగా విలువలతో కూడిన రాజకీయాలను నడిపి దేశానికే కాక యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వ్యక్తి వాజ్ పేయి అని కేసీఆర్ నివాళులు అర్పించారు.  

  • Loading...

More Telugu News