Chandrababu: ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

  • ప్రకాశం బ్యారేజ్ వద్ద ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్
  • సెల్ఫీలకు చిరునామాగా ఈ పాయింట్ ఉంటుంది
  • అమరావతిని ఉత్తమ నగరంగా నిలుపుతాము

విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ‘మన అమరావతి’ సెల్ఫీ పాయింట్ ను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కృష్ణా ఘాట్ వద్ద ఈ సెల్ఫీ పాయింట్ ను ఏర్పాటు చేశారు. సెల్ఫీలకు చిరునామాగా ‘మన అమరావతి’ పాయింట్ ఉంటుందని అన్నారు. వచ్చే ఐదు, పదేళ్లలో అమరావతిని ఉత్తమ నగరంగా నిలుపుతామని చెప్పారు. ఈ సందర్భంగా అమరావతి బాండ్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ బాండ్లకు వచ్చిన స్పందన అద్భుతమని అన్నారు. తన పరిపాలనా పారదర్శకతకు నిదర్శనమే ఈ స్పందన అని, రైతులు కూడా తమ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. హైకోర్టు భవనాల నిర్మాణానికి  టెండర్లు పిలిచామని, త్వరలోనే శాశ్వత అసెంబ్లీ నిర్మాణ పనులను ప్రారంభిస్తామని చెప్పారు. డిసెంబర్ నాటికి అమరావతి రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు అన్నారు.

  • Loading...

More Telugu News