srinivas: బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలపై 'సాక్ష్యం' ఎఫెక్ట్

  • భారీ బడ్జెట్ తో సినిమాలు
  • జోడీగా స్టార్ హీరోయిన్స్
  • మాస్ కంటెంట్ తో కథలు

మొదటి నుంచి కూడా బెల్లంకొండ శ్రీనివాస్ భారీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. స్టార్ హీరోయిన్స్ తో జోడీకడుతూ మంచి మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సాక్ష్యం' సినిమా కూడా భారీ బడ్జెట్ తోనే నిర్మితమైంది. సినిమా ఫరవాలేదనిపించినా, ఆశించినస్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది.

శ్రీనివాస్ మార్కెట్ కి మించి ఖర్చు చేయడం వల్లనే ఈ విధంగా జరిగిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. దాంతో ఆయనతో సినిమాలు చేయాలనుకుంటున్న నిర్మాతలు ముందుగానే జాగ్రత్త పడిపోయినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ తన తదుపరి ప్రాజెక్టులను తేజ దర్శకత్వంలోను .. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై కొత్త దర్శకుడితోను చేయనున్నాడు. ఈ రెండు సినిమాల నిర్మాతలు ముందుగా అనుకున్న బడ్జెట్ లో కోత పెట్టినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. పరిమితమైన బడ్జెట్ లోనే ఈ రెండు సినిమాలు నిర్మితం కానున్నాయన్న మాట.     

  • Loading...

More Telugu News