nrusimha sidhanthi: నృసింహరామ సిద్ధాంతి మృతిపై కేసీఆర్ సంతాపం

  • ఈరోజు ఉదయం మృతి చెందిన నృసింహ రామ సిద్ధాంతి
  • సిద్ధాంతి కుటుంబానికి కేసీఆర్ సానుభూతి
  • ఆయనతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న కేసీఆర్

ప్రముఖ జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త, సిద్ధాంతిగా దశాబ్దాల పాటు సేవలందించిన బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహ రామ సిద్ధాంతి (97) ఈ ఉదయం నిర్యాణం చెందిన విషయం తెలిసిందే. నృసింహ రామ సిద్ధాంతి మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా నృసింహ రామ సిద్ధాంతితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కాగా, వరంగల్ జిల్లాలోని కొడకండ్ల ఆయన స్వగ్రామం. 'కొడకండ్ల సిద్ధాంతి'గా ఆయన పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం.  

  • Loading...

More Telugu News