janhvi kapoor: భారీ చారిత్రక చిత్రంలో జాన్వీ కపూర్ .. బడ్జెట్ 500 కోట్లు

  • కరణ్ జొహార్ నిర్మాతగా చారిత్రక చిత్రం
  • ప్రధాన హీరోగా రణ్ వీర్ సింగ్.. నాయికలుగా కరీనా, అలియా భట్
  • మరో హీరోగా విక్కీ కౌశల్..అతని సరసన జాన్వీ 

తొలి చిత్రంతోనే జాన్వీ కపూర్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నటన పరంగాను .. గ్లామర్ పరంగాను మంచి మార్కులు కొట్టేసింది. దాంతో జాన్వీ కపూర్ ను వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ భారీ చారిత్రక చిత్రంలో నటించే ఛాన్స్ ఆమెకి దక్కింది .. ఆ సినిమా పేరే 'తక్త్'. ఈ పేరుకి 'సింహాసనం' అనే అర్థం వుంది. అందువలన ఇది సింహాసనం కోసం కొనసాగే పోరాట చిత్రంగా ఉంటుందని అనుకోవచ్చు.

500 కోట్ల రూపాయల బడ్జెట్ తో కరణ్ జొహార్ ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా నటించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన కరీనా కపూర్ .. అలియా భట్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఈ సినిమాలో విక్కీ కౌశల్ కూడా ఒక హీరో. ఆయన జోడీగా జాన్వీ కపూర్ ను తీసుకుని ఉండొచ్చునని అనుకుంటున్నారు. కెరియర్ ప్రారంభంలోనే ఇంతటి భారీ చిత్రంలో జాన్వీ కపూర్ కి చోటు లభించడం విశేషమేనని చెప్పాలి.      

  • Loading...

More Telugu News