Mahesh Babu: మహేశ్ అభిమానులకు డబుల్ ట్రీట్!

  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'రిషి'
  • రేపు మహేశ్ బాబు పుట్టినరోజు
  • ఆ రోజున ఫస్టులుక్ .. టీజర్ రిలీజ్  

ప్రస్తుతం మహేశ్ బాబు .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇది మహేశ్ బాబుకి 25వ సినిమా కావడంతో, అభిమానులంతా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తున్నారు. దాంతో ఈ సినిమాకి సంబంధించిన అన్ని అంశాలపై దర్శక నిర్మాతలు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ సినిమాకి 'రిషి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన దగ్గర నుంచి అందుకు సంబంధించిన పనులు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి.

రేపు మహేశ్ బాబు పుట్టినరోజు .. ఆయన అభిమానులందరికీ పండుగరోజు. అందువలన ఆ రోజున ఆయన ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించడానికి ఈ సినిమా టీమ్ రెడీ అవుతోంది. డేట్ మారుతుండగానే .. అంటే 9వ తేదీ రాగానే 12 గంటల 06 నిమిషాలకి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ఉదయం 9 గంటల 09 నిమిషాలకి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఒకే రోజున ఫస్టులుక్ ను .. టీజర్ ను రిలీజ్ చేస్తుండటం అభిమానులకు డబుల్ ట్రీట్ వంటిదే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్న సంగతి తెలిసిందే.        

  • Loading...

More Telugu News