టీడీపీ మద్దతుతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రసాద్!
- కర్ణాటకకు చెందిన ఎంపీని బరిలోకి దింపిన కాంగ్రెస్
- సీపీఐ, టీడీపీ, తృణమూల్ తదితర పార్టీల మద్దతు
- హరిప్రసాద్ విజయం ఖాయమన్న ఆనంద్ శర్మ
తమకు మద్దతివ్వాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కోరారు. అయితే, ఆజాద్ కోరికను సున్నితంగా ఆయన తిరస్కరించినట్టు తెలుస్తోంది. తాము జేడీయూకు చెందిన హరివంశ్ నారాయణ్ కు మద్దతిస్తామని హామీ ఇచ్చామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో హరిప్రసాద్ విజయం సాధిస్తారని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు. తాము చాలా మంది పేర్లను పరిశీలించి హరిప్రసాద్ పేరును ఎంపిక చేశామని ఆయన తెలిపారు.