karunanidhi: డీఎంకే అధినేత కరుణానిధి కన్నుమూత!

  • చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కరుణ
  • కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు

డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి (94) కన్నుమూశారు. అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈరోజు సాయంత్రం 6.10 గంటలకు కరుణానిధి తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు ప్రకటించారు.

 కాగా, గత నెల 24వ తేదీన కరుణానిధిని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అదే ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. వయోభారం కారణంగా కరుణానిధి శరీర అవయవాలు చికిత్సకు స్పందించలేదు. కరుణ ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వైద్యులు ఎంతగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కరుణ ఇక లేరన్న వార్తతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోక సంద్రంలో మునిగిపోయారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు చేరుకుంటున్నారు.

  • Loading...

More Telugu News