doctor shilpa: డాక్టరు శిల్పది టీడీపీ ప్రభుత్వ హత్యే!: వైసీపీ నేత రోజా ఆరోపణ

  • పీలేరులో శిల్ప కుటుంబసభ్యులకు పరామర్శ
  • టీడీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది
  • ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలి

ఎస్వీ వైద్య కళాశాలకు చెందిన డాక్టరు శిల్ప ఆత్మహత్య ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిత్తూరు జిల్లా పీలేరులోని డాక్టరు శిల్ప కుటుంబసభ్యులను ఈ రోజు ఆమె పరామర్శించారు. అనంతరం, మీడియాతో రోజా మాట్లాడుతూ, డాక్టరు శిల్ప ఆత్మహత్య టీడీపీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. టీడీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, సీఎంకు ఆడపిల్లలు లేరు కనుక ఆడబిడ్డల బాధలు ఆయనకు తెలియవంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 

కాగా, డాక్టరు శిల్ప ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ కేసు విచారణకు హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. డీఈఎం కె. బాబ్జీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి విచారణ జరపనుంది.

  • Loading...

More Telugu News