kanna: కేంద్రం ఏపీకి ఇచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికీ ఇవ్వలేదు: కన్నా లక్ష్మీనారాయణ

  • చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • కేంద్ర నిధులను దారి మళ్లించారు
  • చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారు

కేంద్రం ఏపీకి ఇచ్చినన్ని నిధులు మరే రాష్ట్రానికీ ఇవ్వలేదని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీని దోషిగా చూపించేందుకు చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులను దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని, దీక్షల పేరిట బాబు కోట్ల రూపాయలు దుబారా చేశారని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు అడ్డమైన హామీలన్నీ ఇచ్చారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News