chennai: రేపు చెన్నై వెళ్లనున్న సీఎం చంద్రబాబు

  • కరుణానిధిని పరామర్శించనున్న బాబు
  • చెన్నై పర్యటన అనంతరం తిరుపతి రానున్న అధినేత
  • ఎస్వీయూలో ‘జ్ఞానభేరి’లో పాల్గొననున్న ముఖ్యమంత్రి

చెన్నై కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధిని పరామర్శించడానికి ఏపీ సీఎం చంద్రబాబు రేపు చెన్నై వెళుతున్నారు. చెన్నై పర్యటన ముగించుకున్న అనంతరం చంద్రబాబు తిరుపతి చేరుకుంటారు. తిరుపతిలో ఎస్వీయూ విద్యార్థులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమం ‘జ్ఞానభేరి’లో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం.

కాగా, కృష్ణా జిల్లాలో చంద్రబాబు ఈరోజు పర్యటించారు. విస్సన్నపేట మండలం తాతకుంట్లలో నిర్వహించిన ‘గ్రామదర్శిని’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘రచ్చబండ’లో పాల్గొన్న మహిళలతో కూడా చంద్రబాబు మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలని చెప్పారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యంగా ముందుకెళ్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News