aadi pinishetty: 'యూ టర్న్' నుంచి ఆది పినిశెట్టి ఫస్టులుక్

  • సమంత ప్రధాన పాత్రగా 'యూ టర్న్'
  • కీలకమైన పాత్రలో ఆది పినిశెట్టి 
  • సెప్టెంబర్ 13వ తేదీన విడుదల  

సమంత ప్రధానమైన పాత్రగా 'యూ టర్న్' సినిమా రూపొందుతోంది. తెలుగు .. తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోన్న ఈ సినిమాకి పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన సమంత ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఆది పినిశెట్టి ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ఆయన మర్డర్ మిస్టరీని ఛేదించే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఇంతవరకూ తాను చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని ఆది పినిశెట్టి అంటున్నాడు. ఈ సినిమాతో తనకి మరింత గుర్తింపు వస్తుందని ఆయన భావిస్తున్నాడు. శ్రీనివాస్ .. రాంబాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, త్వరలోనే పాటల చిత్రీకరణను జరుపుకోనుంది. భూమిక .. రాహుల్ రవీంద్రన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, సెప్టెంబర్ 13వ తేదీన విడుదల చేయనున్నారు

  • Loading...

More Telugu News