Nagarjuna: నా గ్రీన్ ఛాలెంజ్ పూర్తి చేశా.. ఇక సమంత వంతు!: నటుడు నాగార్జున

  • ఎంపీ సంతోష్ కు ఇచ్చిన మాట పూర్తి చేశా
  • ‘అన్నపూర్ణ’ లో మా సిబ్బందితో కలిసి మొక్కలు నాటా
  • కరణ్ జోహార్, కార్తీ, ధనుష్ కు గ్రీన్ ఛాలెంజ్

తెలంగాణ ఎంపీ సంతోష్ కుమార్ తనకు చేసిన గ్రీన్ ఛాలెంజ్ ను ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున పూర్తి చేశారు. తమ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లోని గార్డెన్ లో మొక్కలు నాటారు. తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన విషయాన్ని నాగార్జున తన ట్వీట్ లో తెలిపారు. ‘మీకు మాటిచ్చినట్టే అన్నపూర్ణ స్టూడియోస్ లో మా సిబ్బందితో కలిసి మొక్కలు నాటాను. ఇక మీ వంతు ఫ్రెండ్స్! కరణ్ జోహార్, కార్తీ, ధనుష్ కె రాజా, నా కోడలు సమంత ఈ గ్రీన్ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నా’ అని తన ట్వీట్ లో నాగార్జున చెప్పారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో తమ సిబ్బందితో కలిసి మొక్కలు నాటుతున్న ఫొటోలను నాగార్జున పోస్ట్ చేశారు.

కాగా, నాగార్జునకు ఎంపీ సంతోష్ కుమార్ తన కృతఙ్ఞతలు తెలిపారు. తన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటినందుకు, ఈ ఛాలెంజ్ ను ముందుకు తీసుకెళ్తున్నందుకు నాగార్జునకు కృతఙ్ఞతలు తెలియజేస్తూ సంతోష్ కుమార్ ఓ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News