mudragada: కాపు నేతలతో రహస్య సమావేశాన్ని నిర్వహించిన ముద్రగడ

  • ఉభయగోదావరి, విశాఖ కాపు జేఏసీ నేతలతో భేటీ
  • కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్న వారికే 2019లో మద్దతు
  • మీడియాతో మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పాలన్న ముద్రగడ

తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం కాపు జేఏసీ నేతలతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రహస్య సమావేశాన్ని నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ నివాసంలో ఈ సమావేశం జరిగింది. కాపులకు రిజర్వేషన్లను కల్పించేందుకు ఎవరైతే చిత్తశుద్ధితో ముందుకు వస్తారో వారికే 2019 ఎన్నికల్లో మద్దతు ఇద్దామని ఈ సందర్భంగా ముద్రగడ చెప్పినట్టు సమాచారం.

మీడియాతో మాట్లాడే సందర్భంగా ఇదే విషయాన్ని చెప్పాలని... ఎవరికి వారు ఇష్టానుసారంగా మీడియాతో మాట్లాడవద్దని సూచించినట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో లేనివాటిని తాము చేయలేమంటూ నేతలు మాట్లాడుతున్న తరుణంలో... ఈ సమావేశాన్ని నిర్వహించడం ప్రత్యేకతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News