vikram: భారీ మూవీ అయినప్పటికీ తప్పుకోవడానికి కారణమదే: త్రిష

  • నాయిక పాత్ర నాకు తగినదిగా లేదు 
  • అందుకే ఆరంభంలోనే నో చెప్పాను
  • అప్పటికి షూటింగ్ మొదలుకాలేదు    

విక్రమ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో ఒకటిగా 'సామి' కనిపిస్తుంది. హరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా త్రిష నటించింది. 2003లో వచ్చిన ఈ సినిమా, భారీ విజయాన్ని సాధించింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందుతోంది. విక్రమ్ హీరోగా హరి ఈ సినిమాకి సీక్వెల్ చేస్తూ .. 'సామి స్క్వేర్' అనే టైటిల్ ను ఖరారు చేశాడు. ఈ సినిమాలోనూ కథానాయికగా త్రిషను ఎంపిక చేస్తున్నట్టుగా చెప్పారు. ఆ తరువాత ఆ ప్లేస్ లోకి కీర్తి సురేశ్ ను తీసుకున్నారు.

త్రిష ఈ మూవీ నుంచి తప్పుకోవడం వల్లనే కీర్తి సురేశ్ ను తీసుకున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాన్ని గురించి త్రిష స్పందిస్తూ .. "ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడినదే అయినా, కథానాయిక పాత్ర నాకు తగినట్టుగా లేదనిపించింది. అందువల్లనే ఈ ప్రాజెక్టు నుంచి ఆరంభంలోనే తప్పుకున్నాను. షూటింగు మొదలుకాక మునుపే నా నిర్ణయం చెప్పాను" అంటూ అసలు విషయాన్ని స్పష్టం చేసింది. శిబు తమీన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో మరో కథానాయికగా ఐశ్వర్య రాజేశ్ నటిస్తుండగా, విలన్ గా బాబీ సింహా చేస్తున్నాడు.    

  • Loading...

More Telugu News