Chandrababu: బీజేపీ తీరుకు నిరసనగా ర్యాలీ.. చంద్రబాబుకు మమతా బెనర్జీ ఆహ్వానం

  • మమత నేతృత్వంలో ఢిల్లీలో ర్యాలీ
  • చంద్రబాబును పాల్గొనాల్సిందిగా ఆహ్వానం 
  • మమతను కలసిన టీడీపీ ఎంపీలు

బీజేపీ తీరును నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ నెలలో ఢిల్లీలో ఓ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా కోరుతూ చంద్రబాబుకు ఆమె ఆహ్వానం పంపారు. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ఈరోజు ఆమెను కలిశారు. జాతీయ, ఏపీ రాజకీయాలపై వారితో ఆమె చర్చించారు. కాగా, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయమై కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను టీడీపీ ఎంపీలు ఈరోజు కలిసి వినతిపత్రం సమర్పించారు.

  • Loading...

More Telugu News