rajani: '2.ఓ' సినిమా నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • 400 కోట్ల బడ్జెట్ తో '2.ఓ'
  • నవంబర్ 29న సినిమా రిలీజ్ 
  • అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలుగా '2.ఓ' సినిమా రూపొందుతోంది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన టీజర్ ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

టీజర్ తోనే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయేలా ప్లాన్ చేశారని అంటున్నారు. అక్షయ్ కుమార్ తాజా చిత్రమైన 'గోల్డ్' ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో '2.ఓ' సినిమా టీజర్ ను అటాచ్ చేస్తున్నారట. దేశ వ్యాప్తంగా 'గోల్డ్' సినిమాతో పాటు '2.ఓ' టీజర్ కూడా ప్రదర్శితం కానుంది. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే నమ్మకంతో రజనీ అభిమానులు వున్నారు.      

  • Loading...

More Telugu News