గొప్పవాడిని కావాలనే ఆలోచన నాలో కలిగించింది ఘంటసాలగారే: పరుచూరి గోపాలకృష్ణ
- ఘంటసాల గారి పాటలు బాగా పాడేవాడిని
- ఆయన ప్రభావంతో పద్యాలు రాగయుక్తంగా చెప్పేవాడిని
- ఆయన చనిపోయినప్పుడు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు
కానీ అసలు నేను గొప్పవాడిని కావాలి అనే ఆలోచనను నా మనసులో కలిగించిన మహానుభావుడు ఘంటసాల గారు. అప్పట్లో నేను ఘంటసాల గారి పాటలను బాగా పాడేవాడిని. నేను మాస్టారిగా వున్నప్పుడు ఘంటసాల గారి ప్రభావంతోనే పద్యాలను రాగయుక్తంగా చదివేవాడిని. ఘంటసాల గారు చనిపోయినప్పుడు .. మా కాలేజ్ పిల్లలంతా వెక్కి వెక్కి ఏడ్చేశారు.
ఒక గాయకుడు ఇంతగా జనం హృదయాల్లోకి వెళ్లిపోయాడా? .. ఇంతమందితో అనుబంధాన్ని పెంచుకున్నాడా? అని ఆశ్చర్యం వేసింది. నేను చనిపోయినప్పుడు కూడా ఇలా ఏడ్చే బయటి మనుషులు దొరికితే ఎంత బాగుండును అనే ఆలోచన ఆ రోజున నా బుర్రలోకి వచ్చింది. నేను కూడా గొప్పవాడిని కావాలి .. కావాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చారు.