అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ-జనసేన కలసి కుట్ర!: మంత్రి పుల్లారావు ఆరోపణ
- పవన్ రాజధాని పర్యటన వెనుక బీజేపీ
- దళిత రైతులకు అన్యాయం చేయొద్దని హితవు
- అమరావతిని అడ్డుకునేందుకు వైసీపీ కేసులు వేసిందని మండిపాటు
ఇప్పటివరకూ వైసీపీ నేతలు కేసులతో రాజధానిని అడ్డుకునేందుకు యత్నిస్తే .. తాజాగా అమరావతిని అడ్డుకుంటామని పవన్ చెప్పడం దారుణమన్నారు. రాజధాని కారణంగా పేద దళిత రైతుల భూముల విలువ కోట్లకు చేరుకుందనీ, ఇప్పుడు రాజధానిని అడ్డుకోవడం ద్వారా పవన్ వారందరికీ అన్యాయం చేయాలనుకుంటున్నారా? అని ప్రత్తిపాటి ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని దళిత రైతులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు.