srinivas: భారీ రేటుకు 'సాక్ష్యం' శాటిలైట్ హక్కులు

  • థియేటర్స్ కి వచ్చిన 'సాక్ష్యం'
  • బీ సీ సెంటర్లలో ఎక్కువ ఆదరణ
  • శాటిలైట్ హక్కుల రూపంలో 13 కోట్లు 

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం' చిత్రం తెరకెక్కింది. సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు పంచభూతాలు సాక్ష్యాలే అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందింది. మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన ఈ సినిమా, భారీతనంతో ప్రత్యేకతను చాటుకుంది. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా, అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను రాబడుతోంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటోంది.

బీ సీ సెంటర్లలో థియేటర్ల దగ్గర కొనసాగుతోన్న సందడి ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులకు సహజంగానే డిమాండ్ పెరిగిపోయింది. 40 కోట్ల ఖర్చుతో నిర్మితమైన ఈ సినిమాకి శాటిలైట్ హక్కుల రూపంలో 13 కోట్ల వరకూ వచ్చింది. తెలుగు శాటిలైట్ హక్కుల నిమిత్తం 8 కోట్లను .. హిందీ శాటిలైట్ హక్కుల నిమిత్తం 5 కోట్లను రాబట్టింది. ఈ స్థాయిలో శాటిలైట్ హక్కులు అమ్ముడవడం విశేషమేనని అంటున్నారు.      

  • Loading...

More Telugu News