Jagan: జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవు.. పవన్ ‘జనసేన’కు అభ్యర్థులే దొరకరు: బుద్ధా వెంకన్న

  • జగన్, పవన్ లు విలన్లు
  • ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు
  • కాపు ఉద్యమానికి నాడు వైసీపీ మద్దతిచ్చిందా? లేదా?

వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవని, పవన్ కల్యాణ్ ‘జనసేన’ కు అభ్యర్థులే దొరకరని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్, పవన్ లు విలన్లు అని, ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. కాపు రిజర్వేషన్ల అంశంపై జగన్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదని అన్నారు. కాపు ఉద్యమానికి నాడు వైసీపీ మద్దతివ్వడం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు. రాజధాని అమరావతిపై పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. 

ఏపీ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ, కాపుల పట్ల జగన్ అసలు రంగు బయటపడిందని విమర్శించారు. ‘మాట తప్పం మడమ తిప్పం’ అనే జగన్ ఇప్పుడెందుకు మాట మార్చారని ప్రశ్నించారు. ప్రధాని మోదీని వ్యతిరేకించే దమ్ములేకనే కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని జగన్ ప్రకటించారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు బాగుంటే కాపు రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేదని అన్నారు.

  • Loading...

More Telugu News