Mahesh Babu: 100 రోజులు పూర్తిచేసుకోనున్న 'భరత్ అనే నేను'

- కథాకథనాలను పట్టుగా నడిపించిన కొరటాల
- మహేశ్ బాబు నటనకు నీరాజనాలు
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దేవిశ్రీ సంగీతం
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా 'భరత్ అనే నేను' తెరకెక్కింది. కైరా అద్వాని కథానాయికగా నటించిన ఈ సినిమా, ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. మహేశ్ బాబు కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 28వ తేదీన 100 రోజులను పూర్తిచేసుకోనుంది.
