rape: సికింద్రాబాద్ లో ఆర్మీ జవాన్ అఘాయిత్యం: ఒంటరిగా ఉన్న జంటపై దాడి.. యువతిపై అత్యాచారయత్నం!

  • ఓ జంటపై దాడి చేసిన ఆర్మీ జవాన్ బ్రిజేష్ కుమార్
  • యువతిపై అత్యాచారయత్నం.. ప్రియుడిపై దాడి
  • పోలీసుల రాకతో పారిపోయిన నిందితుడు

సికింద్రాబాద్ లోని తిరుమలగిరిలో ఓ ఆర్మీ జవాన్ దారుణాలకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న జంటలను లక్ష్యంగా చేసుకుని ఆర్మీ జవాన్ బ్రిజేష్ కుమార్ అత్యాచారాలకు పాల్పడుతున్నాడు. నిన్న ఒంటరిగా ఉన్న ఓ జంటపై దాడి చేసి, యువతిపై అత్యాచారానికి యత్నించాడు. అత్యాచారానికి యత్నిస్తున్న సమయంలో ఆ యువతి పోలీసులకు ఫోన్ చేసింది.

 ఈ సమాచారం మేరకు పోలీసులు స్పందించి అక్కడికి వెళ్లారు. పోలీసులు రావడం చూసి నిందితుడు పారిపోయాడు. కాగా, అడ్డుపడ్డ ప్రియుడిపై బ్రిజేష్ దాడి చేయడంతో అతని పళ్లు ఊడిపోయాయి. నాలుగు నెలల క్రితం పదో తరగతి విద్యార్థినిపై బ్రిజేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డీఎన్ఏ ఆధారంగా ఈ రెండు కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్టు తేలిందని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News