Tirumala: 27న తిరుమల ఆలయంతో పాటు అన్నదాన సత్రమూ మూసివేత

  • 27న సంపూర్ణ చంద్రగ్రహణం
  • 12 గంటల పాటు ఆలయం మూత
  • అన్న ప్రసాద వితరణ ఉండదన్న జేఈఓ

ఈ నెల 27న శుక్రవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం దాదాపు 12 గంటల పాటు మూతపడనుంది. గ్రహణ సమయంలో స్వామివారి ఆలయంతో పాటు అన్నదాన సత్రాన్ని కూడా మూసివేయనున్నామని టీటీడీ అధికారులు ఈ ఉదయం ప్రకటించారు.

 27 సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని మూసివేస్తామని, ఆపై 28 తెల్లవారుజామున 4.15 గంటలకు ఆలయాన్ని తెరచి, శుద్ధి కార్యక్రమం అనంతరం ఇతర పూజలు జరుగుతాయని తెలిపారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రంతో పాటు, వివిధ ప్రాంతాల్లో అన్న ప్రసాద వితరణ కూడా ఆ సమయంలో ఉండదని, భక్తులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని సహకరించాలని టీటీడీ జేఈఓ శ్రీనివాసరాజు సూచించారు.

  • Loading...

More Telugu News