surya: రైతులకు కోటి రూపాయల విరాళం ప్రకటించిన సూర్య

  • కార్తీ హీరోగా వచ్చిన 'చినబాబు'
  • నిర్మాతగా వ్యవహరించిన సూర్య 
  • తమిళంలో సక్సెస్ సాధించిన మూవీ

ఒక వైపున నిర్మాతగానూ .. మరో వైపున హీరోగాను సూర్య వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవల కార్తీ హీరోగా ఆయన తమిళంలో 'కడైకుట్టి సింగం' సినిమాను నిర్మించాడు. తెలుగులో ఈ సినిమా 'చినబాబు' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వ్యవసాయం .. రైతుల నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈ సినిమాలో ఒక రైతుగా రైతుల సమస్యల పక్షాన నిలిచి కథానాయకుడు పోరాడతాడు.

తెలుగులో ఈ సినిమా ఒక మోస్తరుగా ఆడినా, తమిళంలో మాత్రం ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ వేదికపై సూర్య మాట్లాడుతూ .. తమిళనాడులోని రైతుల కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించాడు. తన 'అగరం' ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు సూర్య స్కాలర్ షిప్ లు అందజేస్తోన్న సంగతి తెలిసిందే.      

  • Loading...

More Telugu News