Pawan Kalyan: నిన్నటి మోదీ స్క్రిప్ట్ రాసిచ్చింది జగన్-పవన్ లే: బుద్ధా వెంకన్న సెటైర్లు

  • జగన్, పవన్ ల విజ్ఞప్తులనే నిన్న మోదీ చదివారు
  • వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఒకటే
  • పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలకు పనికిరాడు

నిన్న లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ చదివిన స్క్రిప్ట్ జగన్-పవన్ లు రాసిచ్చిందేనని టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్, పవన్ ల విజ్ఞప్తులనే లోక్ సభలో నిన్న మోదీ చదివి వినిపించారని, అవిశ్వాస తీర్మానంతో ఎవరు ఏ పార్టీకి అండగా ఉన్నారో ప్రజలకు అర్థమైందని, వైసీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు ఒకటేనని విమర్శించారు. ఆ మూడు పార్టీలు ఒకే భవనంలో కార్యాలయం పెట్టుకుంటే వారికి డబ్బు ఆదా అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాసం వీగిపోయిందని జగన్, పవన్ లు  నిన్న సంబరపడ్డారని, పవన్ కల్యాణ్ ఇక రాజకీయాలకు పనికిరాడంటూ వెంకన్న మండిపడ్డారు.

  • Loading...

More Telugu News