Congress: లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ.. బీజేపీలో చేరిన గుజరాత్ మాజీ సీఎం కుమారుడు

  • రెండు వారాల వ్యవధిలో రెండు షాకులు
  • బీజేపీ తీర్థం పుచ్చుకున్న మహేంద్రసింగ్ వాఘేలా
  • కాంగ్రెస్ టికెట్‌పై రెండుసార్లు అసెంబ్లీకి

వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి గుజరాత్‌లో మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శంకర్ సింగ్ వాఘేలా కుమారుడు మహేంద్రసింగ్ శనివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీతూ వాఘానీ ఈ విషయాన్ని వెల్లడించారు. మహేంద్రసింగ్ వాఘేలా 2007, 2012లో రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

రెండు వారాల వ్యవధిలోనే కాంగ్రెస్‌కు ఇది రెండో ఎదురుదెబ్బ. ఈ నెల 3న కాంగ్రెస్ సీనియర్ నేత కున్వరి బవాలియా పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. చేరిన వెంటనే ఆయనకు కేబినెట్ పదవి దక్కింది. బీజేపీలో చేరిన వెంటనే మహేంద్రసింగ్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. పురాతన పార్టీకి పునరుజ్జీవనం తేవాలన్న ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రయత్నాలు ఫలించబోవన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదన్నారు.

  • Loading...

More Telugu News