shankar: డబ్బు వెనక్కి ఇచ్చేయమనడంతో శంకర్ అలా చేశాడట!

  • నిర్మాణానంతర పనుల్లో '2.ఓ'
  • 15 నిమిషాల పుటేజ్ చూపించిన శంకర్ 
  • డిస్ట్రిబ్యూటర్లలో పెరిగిన నమ్మకం

రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రలుగా '2.ఓ' సినిమా రూపొందింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడుతూ వస్తోంది. దాంతో ఆయా ప్రాంతాల నుంచి ఈ సినిమా హక్కుల కోసం అడ్వాన్స్ చెల్లించిన డిస్ట్రిబ్యూటర్లు .. తమ డబ్బు వెనక్కి ఇచ్చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారట.

రిలీజ్ డేట్ చెప్పకపోవడమే అందుకు కారణమని భావించిన శంకర్ .. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయినా కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు తమ డబ్బును తిరిగి ఇచ్చేయమంటూ గొడవ చేస్తుండటంతో, వాళ్లందరినీ చెన్నై కి ఆహ్వానించి .. 15 నిమిషాల నిడివి కలిగిన పుటేజ్ ను చూపించాడట. '2.ఓ' పుటేజ్ ను చూసిన డిస్ట్రిబ్యూటర్లు ఆశ్చర్యపోయారట .. ఈ సినిమా సంచలన విజయం సాధించడం ఖాయమనే నమ్మకంతో వెనుదిరిగి వచ్చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.  

  • Loading...

More Telugu News