Virat Kohli: మరో మైలురాయిని అందుకున్న కోహ్లీ!

  • ఇంగ్లండ్ తో జరుగుతున్న తొలి వన్డే
  • ఈ మ్యాచ్ తో 50 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన కోహ్లీ
  • 209వ వన్డే ఆడుతున్న విరాట్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. ఈరోజు ఇంగ్లండ్ తో తొలి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 50 వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించినవారి క్లబ్ లో చేరాడు. టీమిండియాకు అత్యధికంగా ధోనీ 199 మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాతి స్థానాల్లో అజారుద్దీన్ (174), గంగూలీ (146), రాహుల్ ద్రావిడ్ (74), టెండూల్కర్ (73)లు ఉన్నారు. ఇప్పటి వరకు కోహ్లీ 209 వన్డేలు ఆడాడు. ఇందులో 35 సెంచరీలు, 46 హాఫ్ సెంచరీలు చేశాడు. మొత్తమ్మీద 9588 పరుగులు చేశాడు. 

  • Loading...

More Telugu News