Mahesh Babu: డెహ్రాడూన్ లో షూటింగ్ పూర్తిచేసిన మహేశ్ బాబు

  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్ బాబు 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • పరిశీలనలో 'రాజసం' టైటిల్  

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. మహేశ్ కి ఇది 25వ సినిమా .. అందువలన ప్రతి అంశానికి సంబంధించి ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ ను డెహ్రాడూన్ లో చిత్రీకరించారు. అక్కడ 24 రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, తాజాగా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది.

రెండవ షెడ్యూల్ ను విదేశాల్లో ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడ కొన్ని సన్నివేశాలతో పాటు పాటలను కూడా చిత్రీకరించవచ్చని అంటున్నారు. ఈ సినిమాలో మహేశ్ బాబు కొత్త లుక్ తో కాలేజ్ స్టూడెంట్ గాను .. రైతుల తరఫున పోరాడే యువకుడిగాను కనిపించనున్నాడని చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమా కోసం 'రాజసం' అనే టైటిల్ ను పరిశీలిస్తోన్న సంగతి తెలిసిందే.     

  • Loading...

More Telugu News