karthi: నా రెమ్యునరేషన్ ఇవ్వకపోతే అన్నయ్యపై ఫిర్యాదు చేస్తాను: కార్తీ

  • కార్తీ హీరోగా 'చినబాబు'
  • రైతు నేపథ్యంలోని కథ 
  • ఈ నెల 13వ తేదీన విడుదల

సూర్య నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన 'చినబాబు' సినిమాను ఈనెల 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ .. "వ్యవసాయమే ప్రధాన వృత్తిగా బతికే పెద్ద కుటుంబంలో అందరికంటే చిన్నవాడిగా నేను ఈ సినిమాలో కనిపిస్తాను. ఈ సినిమాలో నేను ఓ రైతుగా గోదావరి యాసలో మాట్లాడతాను. అన్నయ్య ఈ సినిమాకి నిర్మాత అయినప్పటికీ, దర్శకుడిపై గల నమ్మకంతో ఎప్పుడూ లొకేషన్ కి రాలేదు.

సినిమా ఎలా వచ్చింది అని అన్నయ్యను అడిగితే .. ఆ విషయం నేను కాదు ప్రజలు చెప్పాలి అన్నాడు. నాకైతే ఈ సినిమాపై బలమైన నమ్మకం వుంది. ఈ సినిమాలో విలన్ ను ప్రత్యేకంగా చూపించడం ఉండదు. అదే ఊళ్లో .. మాతో పాటు కలిసి పెరిగిన వ్యక్తి .. విలన్ గా మారడం ఉంటుంది. మాది వ్యవసాయ నేపథ్యం కలిగిన కుటుంబం కావడం వలన, మా ఇంట్లోని వాళ్లంతా ఈ సినిమా పట్ల ఆసక్తితో వున్నారు. ఇక ఈ సినిమా బాగా ఆడితేనే మా అన్నయ్య నాకు పారితోషికం ఇస్తానని అంటున్నాడు. ఇవ్వకపోతే యాక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేద్దామని అనుకుంటున్నాను" అంటూ నవ్వేశాడు.  

  • Loading...

More Telugu News