kanna: కన్నా అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తాం: బుద్ధా వెంకన్న

  • చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయి
  • కన్నా ర్యాలీల్లో సంఘ విద్రోహశక్తులు పాల్గొంటున్నాయి
  • ప్రత్యేక హోదా కోసం ప్రశ్నిస్తే బీజేపీ నేతలు దాడులు చేస్తారా?

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అవినీతి ఆరోపణలు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై కన్నా వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని, తన పరిధికి మించి ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై అదేపనిగా చేస్తున్న అవినీతి ఆరోపణలను ఆధారాలతో నిరూపించగలరా? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా కన్నా అవినీతి గురించి ఆయన ప్రస్తావించారు. కన్నా అవినీతిని తాము ఆధారాలతో సహా నిరూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నా లక్ష్మీనారాయణ ర్యాలీల్లో సంఘ విద్రోహశక్తులు పాల్గొంటున్నాయని, ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రశ్నించిన వారిపై బీజేపీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News