ysr: వైయస్ కు భారతరత్న ఇవ్వాలంటూ కోటి సంతకాల ఉద్యమానికి శ్రీకారం!

  • వైయస్ కు భారత రత్న ఇవ్వాలంటూ వైసీపీ డిమాండ్
  • అమెరికాలోని వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యమం
  • కార్యక్రమానికి హాజరైన వైసీపీ కీలక నేతలు

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటి సంతకాల ఉద్యమానికి వైసీపీ నేతలు శ్రీకారం చుట్టారు. అమెరికాలోని ఫిలడెల్ఫియాలో వైయస్సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం చేపట్టారు. వైయస్ చిత్రపటానికి నివాళులర్పించి, సంతకాల సేకరణను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరిత, అనిల్, రవీంద్రనాథ్ రెడ్డి, కోన రఘుపతి, ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల కోసం బతికిన మహానేత వైయస్ అని కీర్తించారు. భారతరత్న పురస్కారాన్ని పొందేందుకు వైయస్ అన్ని విధాలా అర్హుడని అన్నారు. అమెరికా గడ్డ మీద నుంచే ఈ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News