bellamkonda srinivas: 'సాక్ష్యం' పాటల పండుగ రేపే

  • శ్రీవాస్ దర్శకుడిగా 'సాక్ష్యం'
  • శ్రీనివాస్ జోడిగా పూజా హెగ్డే 
  • ఈ నెల 20వ తేదీన విడుదల

మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో శ్రీవాస్ పేరు కూడా కనిపిస్తుంది. ఆయన తాజా చిత్రంగా 'సాక్ష్యం' రూపొందింది. బెల్లంకొండ శ్రీనివాస్ .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి దర్శక నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ .. శిల్పకళావేదికలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరుగుతుంది.

ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ గా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. ముఖ్యమైన పాత్రల్లో జగపతిబాబు .. మీనా .. శరత్ కుమార్ .. వెన్నెలకిషోర్ కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.   

  • Loading...

More Telugu News