Jammu And Kashmir: మరో అపశ్రుతి... అమర్ నాథ్ యాత్రలో కొండ చరియలు విరిగిపడి హైదరాబాద్ మహిళ మృతి!

  • నడుస్తూ వెళుతుండగా, దొర్లిపడిన బండరాయి
  • శేరిలింగంపల్లికి చెందిన పులిచర్ల లక్ష్మి మృతి
  • ఆమె కుటుంబంలో విషాధం

పవిత్ర అమర్ నాథ్ యాత్రలో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్ లో కురుస్తున్న వర్షాలకు కొండపై నుంచి బండరాళ్లు జారి పడటంతో అవి తగిలి ఓ మహిళ మరణించింది. హైదరాబాద్, శేరిలింగంపల్లికి చెందిన పులిచెర్ల లక్ష్మి అనే గృహిణి, ఇటీవల యాత్రకు బయలుదేరి వెళ్లింది.

ఆమె నడుస్తుండగా, పై నుంచి ఓ పెద్ద బండరాయి దొర్లుతూ వచ్చి ఆమెను తాకింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మరణించగా, విషయాన్ని అధికారులు బంధువులకు చేరవేశారు. మృతదేహాన్ని స్వస్థలానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News