kidnap: బలవంతంగా బైక్‌పై ఎక్కించుకున్న యువకుడు.. జారిపడిన అమ్మాయి.. ఆసుపత్రిలో మృతి!

  • చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో ఘటన
  • ఎంబీఏ చదువుతోన్న శ్వేతారెడ్డి 
  • బైక్‌పై పెనుగులాట
  • శ్వేతాను హైదరాబాద్‌ ఆసుపత్రిలో చేర్చిన యువకుడు

కిడ్నాప్‌కు గురై అనంతరం ఇటీవల తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన శ్వేతారెడ్డి అనే ఎంబీఏ విద్యార్థిని చికిత్స తీసుకుంటూ ఈరోజు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు. చౌటుప్పల్‌ మండలం మల్కాపూర్‌లో ఆ అమ్మాయి ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో పరీక్ష రాసి వస్తుండగా భరత్‌ రెడ్డి అనే యువకుడు ఆమెను బలవంతంగా బైక్‌ ఎక్కించుకుని తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో బైక్‌పై నుంచి జారిపడిన ఆ యువతికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను భరత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాడు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడిది నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలని తెలిపారు.

  • Loading...

More Telugu News