nellore: నెల్లూరులో దారుణం..భార్య, ప్రియుడిని ఇంట్లో బంధించి నిప్పంటించిన భర్త!

  • ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో సంఘటన
  • వాళ్లిద్దరిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త 
  • భార్య, ప్రియుడు సజీవదహనం

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. భార్యను, ప్రియుడిని ఇంట్లో బంధించి ఆమె భర్త నిప్పంటించిన సంఘటన ముత్తుకూరు మండలం కోళ్లమిట్టలో జరిగింది. ఈ మంటల్లో భార్య, ఆమె ప్రియుడిపై భర్త హరిబాబు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వాళ్లిద్దరూ సజీవదహనమైనట్టు సమాచారం. మృతులు మడపాక కవిత, పంటపాలెంకు చెందిన శ్రీనివాసులుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు కారణం వివాహేతర సంబంధమేనని భావిస్తున్నామని, ఈ ఘాతుకానికి పాల్పడ్డ భర్త హరిబాబు పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని, మరింత సమాచారం తెలియాల్సి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News