hen: రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు కొట్టిన కండక్టర్!

  • కర్ణాటకలోని గౌరీబిదనూరు సమీపంలో ఘటన
  • కోళ్లకు హాఫ్ టికెట్ కొట్టిన కర్ణాటక ఆర్టీసీ
  • కోళ్లు, గువ్వలు, చిలుకలులాంటి వాటికి హాఫ్ టికెట్ తీసుకోవాల్సిందేనన్న అధికారులు

ఇకపై కోళ్లు, చిలుకలు తీసుకొని బస్సెక్కే వారు.. వాటికి+ కూడా టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండొచ్చేమో. కర్ణాటకలో ఇలాంటి ఘటనే జరిగింది. బెంగళూరు సమీపంలో ఉన్న గౌరీబిదనూరు తాలూకా ముదలోడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తన రెండు కోళ్లను తీసుకుని కర్ణాటక ఆర్టీసీ బస్సు ఎక్కాడు.

 బస్ కండక్టర్ అతనికో టికెట్, రెండు కోళ్లకు రెండు హాఫ్ టికెట్లు కొట్టాడు. ఆ టికెట్లపై పిల్లలకు అని రాసి ఇచ్చాడు. ఈ సందర్భంగా టికెట్ పై పిల్లలకు అని ఎందుకు రాశావ్? కోళ్లకు అని రాసివ్వు అంటూ కండక్టర్ తో శ్రీనివాస్ వాగ్వాదానికి దిగడం గమనార్హం. ఈ హాఫ్ టికెట్ల వ్యవహారంతో బస్ లోని ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు మాట్లాడుతూ, కోళ్లు, గువ్వలు, చిలుకలులాంటి వాటికి కూడా హాఫ్ టికెట్ తీసుకోవాల్సిందేనని చెప్పారు.

  • Loading...

More Telugu News