KTR: ఇంటింటికీ తులం బంగారం ఇస్తామంటారు.. జాగ్రత్త: కేటీఆర్

  • తెలంగాణను అమ్మా ఇవ్వలేదు.. బొమ్మా ఇవ్వలేదు
  • వందలాది మంది బలిదానాలతో తెలంగాణ వచ్చింది
  • మరో 15 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుంది

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఘాటుగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మా ఇవ్వలేదు, బొమ్మా ఇవ్వలేదని అన్నారు. వందలాది మంది బలిదానాలు చేస్తే తెలంగాణ వచ్చిందని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ద్రోహం చేసిందని అన్నారు. తెలంగాణకు, ఆంధ్రకు అప్పట్లో బలవంతపు పెళ్లి చేసిందని మండిపడ్డారు. తెలంగాణభవన్ లో ఈరోజు పలువురు ఆర్యవైశ్య నేతలు టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల కాలం వచ్చందంటే గాలి మాటలు వినిపిస్తుంటాయని... నోటికి ఏదొస్తే అది మాట్లాడే నాయకులు వస్తారని కేటీఆర్ అన్నారు. ఇంటింటికీ తులం బంగారం ఇస్తామని కూడా చెబుతారని... ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి తీరుతామని... కాంగ్రెస్ వాళ్ల కిందకు కూడా నీళ్లు తెస్తామని చెప్పారు. మరో 15 ఏళ్ల పాటు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉంటుందని తెలిపారు. 

  • Loading...

More Telugu News