Jagan: సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్

  • నిన్న వర్షం కారణంగా పాదయాత్ర వాయిదా
  • హైదరాబాద్ చేరుకుని కోర్టుకు వెళ్లిన జగన్
  • నేడు తిరిగి భీమనపల్లికి జగన్

నిన్న గురువారం నాడు భారీ వర్షం కారణంగా తన పాదయాత్రను వాయిదా వేసుకుని హైదరాబాద్ చేరుకున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, నేడు అక్రమాస్తుల కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు విచారణకు హాజరయ్యారు. జగన్ తో పాటు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. ప్రతి శుక్రవారం నాడు జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 ప్రస్తుతం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేస్తున్న జగన్, రేపు తూర్పు గోదావరి జిల్లా భీమనపల్లి నుంచి తన యాత్రను కొనసాగిస్తారని వైకాపా వర్గాలు వెల్లడించాయి. నేటి సాయంత్రం హైదరాబాద్ నుంచి జగన్ తిరిగి భీమనపల్లికి బయలుదేరి వెళ్లనున్నారు.

Jagan
YSRCP
Vijayawai Reddy
Nampalli
CBI Court
  • Loading...

More Telugu News