Hyderabad: హైదరాబాద్‌లో విషాదం.. ఇద్దరు విద్యార్థులను ఢీ కొన్న ఆర్టీసీ బస్సు.. ఒకరి మృతి

  • హకీంపేటలో ఘటన
  • విద్యార్థి ఓం ప్రకాశ్‌ (14) మృతి 
  • విష్ణువర్ధన్‌కు గాయాలు

హైదరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగర శివారు హకీంపేటలో వేగంగా వెళుతోన్న ఓ ఆర్టీసీ బస్సు ఇద్దరు పాఠశాల విద్యార్థులను ఢీ కొట్టింది. దీంతో ఓ విద్యార్థి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో విద్యార్థికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

 ఈ ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థి పేరు ఓం ప్రకాశ్‌ (14) కాగా, గాయాలపాలైన విద్యార్థిని విష్ణువర్ధన్‌గా గుర్తించారు. సదరు విద్యార్థులు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.      

  • Loading...

More Telugu News