nadigar: నడిగర్ సంఘం భూముల విక్రయం కేసు.. నటుడు శరత్ కుమార్ పై కేసు నమోదు

  • అక్రమంగా భూములు విక్రయించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
  • శరత్ కుమార్, రాధారవి, మరో ఇద్దరిపై కేసు నమోదు
  • ఈ మేరకు గతంలో ఫిర్యాదు చేసిన నటుడు విశాల్

దక్షిణాది నటుడు శరత్ కుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. నడిగర్ సంఘం (దక్షిణ భారత నటీనటుల సంఘం) భూముల విక్రయం కేసులో శరత్ కుమార్, నటుడు రాధారవి, మరో ఇద్దరిపై కాంచీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, నడిగర్ సంఘం భూములను అక్రమంగా విక్రయించారనే ఆరోపణలపై నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ విశాల్ పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో వారిపై కేసు నమోదు చేశారు. 

  • Loading...

More Telugu News