TRS: ఈ పరిస్థితుల్లో ఇప్పుడేమీ చెప్పలేను.. నో కామెంట్: డీఎస్ స్పందన

  • జిల్లా నేతలు నాపై అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో?
  • ఆ విషయం వారినే అడగాలి
  • సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోమనండి

టీఆర్ఎస్ నేత డి.శ్రీనివాస్ పై క్రమశిక్షణాచర్యలు తీసుకోవాలని, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా కమిటీ తీర్మానించిన విషయం తెలిసిందే. ఈ విషయమై డీఎస్ ను మీడియా ప్రశ్నించగా.. ‘ఈ పరిస్థితుల్లో ఇప్పుడేమీ చెప్పలేను.. నో కామెంట్’ అని బదులిచ్చారు. అసలు, జిల్లా నేతలు తనపై అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో   తెలియదని, ఆ విషయం వారినే అడగాలని అన్నారు. ‘

సీఎంకు ఫిర్యాదు చేసుకుంటే చేసుకోమనండి’ అని చెప్పిన డీఎస్, తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ వ్యవహరించలేదని చెప్పారు. ‘నేతలు నాపై చేసింది ఫిర్యాదు మాత్రమే కదా, నా గొంతు కోస్తామని చెప్పులేదుగా’ అని డీఎస్ వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, డీఎస్ వల్ల పార్టీకి ఏమాత్రం ప్రయోజనం లేకపోగా, పార్టీకి నష్టం కలిగిందని ఎంపీ కవిత వ్యాఖ్యానించారు. డీఎస్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే డీఎస్ పై వేటు వేయాలని టీఆర్ఎస్ భావిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News