venkatesh: వెంకీ .. వరుణ్ ల మల్టీ స్టారర్ మొదలైపోయింది

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2'
  • హీరోలుగా వెంకటేశ్ .. వరుణ్ తేజ్ 
  • కథానాయికలుగా తమన్నా .. మెహ్రీన్

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ ఒక మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే ఈ సినిమాకి కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలు జరిపించి .. లాంఛనంగా షూటింగును ప్రారంభించారు. ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటించనున్నారు.

పూర్తి వినోదభరితమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ కథ కొనసాగుతుందట. చాలా రోజులుగా మంచి కథ కోసం ఎదురుచూస్తూ వున్న వెంకటేశ్ .. వినగానే ఈ కథను ఓకే చేయడాన్ని బట్టి ఇందులో విషయం ఉందని అర్థమవుతోంది. 'పటాస్' .. 'సుప్రీమ్' .. 'రాజా ది గ్రేట్' లతో వరుస విజయాలను అందుకున్న అనిల్ రావిపూడి నుంచి ఈ సినిమా వస్తుండటంతో, అందరిలోను ఆసక్తి పెరుగుతూ వస్తోంది. 

  • Loading...

More Telugu News