women: సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడి మరణించిన మహిళ!

  • మహారాష్ట్రలో విహార యాత్రకు వెళ్లిన ఓ మహిళ
  • రాయ్‌గఢ్‌ జిల్లాలోని మధేరన్‌ లోయ ప్రాంతంలో ఘటన
  • మృతురాలు సరితా రమేశ్‌ చౌహాన్‌ (33)గా గుర్తింపు

సెల్ఫీల మోజుకి మరో ప్రాణం బలైంది. మహారాష్ట్రకు విహార యాత్రకు వెళ్లిన ఓ మహిళ.. రాయ్‌గఢ్‌ జిల్లాలోని మధేరన్‌ లోయ ప్రాంతంలో 500 అడుగుల కొండ పైభాగాన సెల్ఫీ తీసుకుంటూ ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఆమె ఢిల్లీకి చెందిన సరితా రమేశ్‌ చౌహాన్‌ (33) అని, కుటుంబ సభ్యులతో కలిసి టూర్‌కి వచ్చిందని పోలీసులు తెలిపారు. స్థానికుల సాయంతో లోయలో నుంచి ఆమె మృతదేహాన్ని బయటకు తీసినట్లు  చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన తరువాత సరిత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News