bjp: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది!: అసదుద్దీన్ ఒవైసీ

  • లక్నో పాస్ పోర్టు కార్యాలయంలో ఘటనపై ఒవైసీ స్పందన
  • ముస్లింలు, దళితులపై బీజేపీ విషం కక్కుతోంది
  • ప్రభుత్వాధికారి ప్రశ్నించడం సిగ్గుమాలిన తనం

లక్నో పాస్ పోర్టు కార్యాలయంలో ఓ హిందూ-ముస్లిం జంటకు జరిగిన అవమానంపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సందర్భంగా బీజేపీపై దుమ్మెత్తి పోశారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మత ద్వేషాలను రెచ్చగొడుతున్నారని, ముఖ్యంగా ముస్లింలు, దళితులపై విషం కక్కుతోందని ఆరోపించారు. ఓ జంట వివాహాన్ని ఓ ప్రభుత్వాధికారి సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రశ్నించే పరిస్థితులు దేశంలో తలెత్తాయని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News