nagasourya: ఇటలీలో నాగశౌర్య 'నర్తనశాల' షూటింగ్!

  • ఇటలీకి 'నర్తనశాల' టీమ్ 
  • కీలక సన్నివేశాల చిత్రీకరణ 
  • ఆగస్టులో విడుదల ఆలోచన  

నాగశౌర్య కథానాయకుడిగా 'నర్తనశాల' సినిమా రూపొందుతోంది. అలనాటి క్లాసిక్ మూవీకి .. ఈ సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదనీ .. పూర్తి వినోదభరితంగా ఈ సినిమా కొనసాగుతుందని నాగశౌర్య మొదట్లోనే క్లారిటీ ఇచ్చేశాడు. మెహ్రీన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ద్వారా శ్రీనివాస చక్రవర్తి దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ఇప్పటికే ఇక్కడ కొంతభాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా, ఇటీవలే ఇటలీ వెళ్లింది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఇక్కడ జరిపే ఒక షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంటుంది. మిగతా పనులను చకచకా పూర్తి చేసేసి ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా, 'ఛలో' మాదిరిగా ఆయనకి భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి.  

  • Loading...

More Telugu News